దోహాకు మరో విమాన సర్వీస్: ఇండిగో
- September 07, 2022
దోహా: గల్ఫ్ ప్రాంతానికి తమ నెట్ వర్క్ ను బలోపేతం చేయాలని ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో నిర్ణయించింది. ఇందులో భాగంగా గల్ఫ్ ప్రాంతానికి మరికొన్ని రోజువారీ విమాన సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. దోహా, దుబాయ్, రియాద్లకు అదనపు ఫ్రీక్వెన్సీలను ప్రారంభించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అక్టోబర్ 30 నుండి తెలంగాణలోని హైదరాబాద్ నుండి రియాద్, దోహాలకు ప్రతిరోజూ మరో విమాన సర్వీసును నడుపనుంది. అలాగే కర్ణాటకలోని మంగళూరు నుండి దుబాయ్కి అక్టోబర్ 31 నుండి మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ కొత్త సర్వీసుతో కలిపి హైదరాబాద్ నుండి దోహాకు మొత్తం సర్వీసుల సంఖ్య మూడుకు చేరుకోనుంది. ఇప్పటికే రియాద్-హైదరాబాద్ మధ్య వారానికి రెండుసార్లు ఇండిగో సర్వీసులు నడుస్తుండగా... ఇకపై సోమ, శనివారాల్లో సౌదీ రాజధాని నుండి.. ఆది, శుక్రవారాల్లో హైదరాబాద్ నుండి దుబాయ్కి అదనపు విమాన సర్వీసులు ప్రతిరోజూ నడుపనున్నట్లు ఇండిగో ప్రకటించింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









