సౌదీ ఎయిర్ పోర్ట్స్, ఓడరేవులలో డ్యూటీ ఫ్రీ మార్కెట్లు
- September 07, 2022
సౌదీ: అల్-సలామ్ ప్యాలెస్లో మంగళవారం మధ్యాహ్నం రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సౌదీలోని ఎయిర్ పోర్ట్స్, ఓడరేవులు, ల్యాండ్ పోర్ట్లలో డ్యూటీ ఫ్రీ మార్కెట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితోపాటు ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని వివిధ రంగాలలో అభివృద్ధి చేసే మార్గాల గురించి చైనా అధ్యక్షుడి నుండి తనకు వచ్చిన లేఖలోని విషయాలను కేబినెట్కు కింగ్ సల్మాన్ వివరించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణల వృద్ధిని వేగవంతం చేయడంలో సౌదీ అరేబియా తన ప్రయత్నాలను ముమ్మురం చేసిందని సల్మాన్ వివరించారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 మంత్రివర్గ సమావేశాలలో పాల్గొనడంపై కేబినెట్ చర్చించిందని షౌరా కౌన్సిల్ వ్యవహారాల కేబినెట్ సభ్యుడు మీడియా తాత్కాలిక మంత్రి డాక్టర్ ఎస్సామ్ బిన్ సాద్ బిన్ సయీద్ తెలిపారు. ఇరాక్లో భద్రత, స్థిరత్వానికి హామీ ఇచ్చే ప్రతిదానికీ సౌదీ మద్దతునిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..







