బహ్రెయిన్ కు భారత్ ఎంతో నమ్మకమైన మిత్రదేశం

- September 08, 2022 , by Maagulf
బహ్రెయిన్ కు భారత్ ఎంతో నమ్మకమైన మిత్రదేశం

మనామా: భారత్ తో బహ్రెయిన్ కు ఎంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయని బహ్రెయిన్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్టర్ ఒసామా బిన్ అహ్మద్ ఖలీఫ్ అల్ అస్ఫూర్ అన్నారు. మనమ సిటీ లో ఆయన భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవను కలిశారు. ఈ సందర్భంగా భారత్ తో బహ్రెయిన్ కు ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. సోషల్ డెవలప్ మెంట్ విభాగంలో రెండు దేశాలు మరింత సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరముందని ఆయన అన్నారు. భారత్ కూడా బహ్రెయిన్ తో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవటానికి, స్కిల్ డెవలప్ మెంట్ లో పరస్పర సహకారానికి ఆసక్తి గా ఉందని ఇండియా రాయబారి పీయూష్ శ్రీ వాస్తవ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com