మహిళ రోగి ఫోటో తీసిన ఆసుపత్రి ఉద్యోగి తొలగింపు
- September 09, 2022
రియాద్: హెల్త్కేర్ ఫెసిలిటీని సందర్శించిన మహిళా పేషెంట్ ఫోటో తీసినందుకు గాను ఒక ఉద్యోగిని సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. భద్రతా అధికారులు ఉద్యోగిని అరెస్టు చేశారని, తనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్యోగి రోగి ఫోటోని తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది. ఇలాంటి తప్పుడు పద్ధతులు, రోగుల హక్కుల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. రోగుల హక్కులు, గోప్యతను కాపాడటానికి సంబంధించిన నిబంధనలను పాటించని, మంత్రిత్వ శాఖ విధానాలకు అనుగుణంగా ఆరోగ్య సేవలను అందించడంలో విఫలమైన ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్









