మహిళ రోగి ఫోటో తీసిన ఆసుపత్రి ఉద్యోగి తొలగింపు
- September 09, 2022
రియాద్: హెల్త్కేర్ ఫెసిలిటీని సందర్శించిన మహిళా పేషెంట్ ఫోటో తీసినందుకు గాను ఒక ఉద్యోగిని సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. భద్రతా అధికారులు ఉద్యోగిని అరెస్టు చేశారని, తనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్యోగి రోగి ఫోటోని తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది. ఇలాంటి తప్పుడు పద్ధతులు, రోగుల హక్కుల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. రోగుల హక్కులు, గోప్యతను కాపాడటానికి సంబంధించిన నిబంధనలను పాటించని, మంత్రిత్వ శాఖ విధానాలకు అనుగుణంగా ఆరోగ్య సేవలను అందించడంలో విఫలమైన ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







