మహిళ రోగి ఫోటో తీసిన ఆసుపత్రి ఉద్యోగి తొలగింపు
- September 09, 2022
రియాద్: హెల్త్కేర్ ఫెసిలిటీని సందర్శించిన మహిళా పేషెంట్ ఫోటో తీసినందుకు గాను ఒక ఉద్యోగిని సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. భద్రతా అధికారులు ఉద్యోగిని అరెస్టు చేశారని, తనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్యోగి రోగి ఫోటోని తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది. ఇలాంటి తప్పుడు పద్ధతులు, రోగుల హక్కుల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. రోగుల హక్కులు, గోప్యతను కాపాడటానికి సంబంధించిన నిబంధనలను పాటించని, మంత్రిత్వ శాఖ విధానాలకు అనుగుణంగా ఆరోగ్య సేవలను అందించడంలో విఫలమైన ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







