గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
- September 09, 2022విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం సాయంత్రం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఈ బంగారం పట్టుకున్నట్టు సమాచారం.హైదరాబాద్ నుంచి వచ్చిన కస్టమ్స్ స్పెషల్ టీమ్ గురువారం సాయంత్రం నుంచి గన్నవరం విమానాశ్రయంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. ఒక అధికారి భార్య దుబాయ్ నుంచి వస్తూ బంగారం తీసుకుని వచ్చినట్టు కస్టమ్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైనట్టు సమాచారం.
సదరు మహిళకు ఎయిర్ ఇండియా సంస్థలోని పలువురు సిబ్బంది సహకరించినట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరు సిబ్బంది ఉండగా, వారిలో ఒకరు కింది స్థాయి ఉద్యోగి అని, మరొకరు పై స్థాయి ఉద్యోగి అని సమాచారం. బంగారం తీసుకొని వచ్చిన మహిళ ను కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు సహకరించిన సిబ్బందిని కూడా విచారణ చేస్తున్నట్టు తెలిసింది. సిబ్బంది సహకారం కూడా ఉండటం గమనిస్తే..గన్నవరం విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఎన్ని జరిగి ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే మొదటిసారి అయ్యుండదని, ఇంతకుముందు ఎలాంటి ఘటనలు జరిగాయనే కోణంలోనూ విచారణ చేస్తున్నారని తెలిసింది.ఈ ఘటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బంది విషయంలో ఆ సంస్థ కఠిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంటుంది.దీంతో పాటు గన్నవరం విమానాశ్రయంలో పటిష్టంగా తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకునే అవకాశముంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం