60 శాతం వలసదారులపై కువైట్ మునిసిపాలిటీ వేటు
- April 16, 2016
కువైట్ మునిసిపాలిటీకి చెందిన ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్, 60 శాతం వలసదారుల్ని 'ఎంప్లాయీ ఫోర్స్' నుంచి తగ్గించాలనుకుంటోంది. ఫేక్ డిగ్రీలతో ఉద్యోగం పొందినవారు, అలాగే ఫీల్డ్లో సరిగ్గా పనిచేయనివారు.. ఇలా పలు కేటగిరీల్లో ఎంపిక చేసినవారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతోంది. చాలామంది వలసదారులు, జాబ్ రిక్వైర్మెంట్స్ని చేరుకోలేకపోవడం తొలగింపుకు ప్రధాన కారణం. ఇదే కాకుండా, వలసదారుల జనాభాను నియంత్రించడంలో భాగంగానూ పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. వలసదారులకు రిక్రూట్మెంట్ కూడా నిలిపివేయాల్సిందిగా వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు అవకాశం ఉన్నంతవరకు వారి సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతోంది. 50 ఏళ్ళు పైబడిన వలసదారులను పబ్లిక్ సెక్టార్, ఇతర ప్రొఫెషన్స్ నుంచి తొలగించి, వారిని దేశం నుంచి తిరిగి పంపించేందుకు ఇటీవల చట్టం కూడా తీసుకువచ్చారు. వారి స్థానంలో స్థానిక కువైటీలకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









