భారత్ కరోనా అప్డేట్
- September 12, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 5,221 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,975 మంది కోలుకున్నట్లు చెప్పింది. మృతుల సంఖ్య 5,28,165కి చేరిందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 47,176 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 215.26 కోట్ల వ్యాక్సిన్లు వినియోగించినట్లు పేర్కొంది.
వాటిలో రెండో డోసులు 94.53 కోట్లు, బూస్టర్ డోసులు 18.34 కోట్లు ఉన్నట్లు వివరించింది. నిన్న దేశంలో 30,76,305 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,25,239కు చేరిందని వివరించింది.
వారాంతపు పాజిటివిటీ రేటు 1.72 శాతంగా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 88.95 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 1,84,965 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









