కరోనా కేసులు తగ్గటంతో నిబంధనలు సడలించి యూఏఈ

- September 27, 2022 , by Maagulf
కరోనా కేసులు తగ్గటంతో నిబంధనలు సడలించి యూఏఈ

యూఏఈ : కరోనా కేసులు భారీగా తగ్గటంతో నిబంధనలు సడలిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. గత మూడు నెలలుగా ఒక్క కరోనా మరణం కూడా ఇక్కడ జరగలేదు. పైగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. దీంతో మాస్క్ నిబంధనను సడలించారు. విమానాల్లో, స్కూల్స్ లో మాస్క్ అవసరం లేదని ప్రకటించారు. ఐతే విమాన సంస్థలు మాస్క్ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలనుకుంటే వారికే ఆప్షన్ ఇచ్చారు. రేపటి నుంచి నిబంధనల సడలింపు అమల్లోకి వస్తుంది. ఐతే హాస్పిటల్స్, మసీదులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో మాత్రం మాస్క్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన పెట్టారు. కోవిడ్ రోగులు, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు, ఫుడ్ సర్వీస్ చేసే డెలివరీ బాయ్స్ కచ్చితంగా మాస్క్ లు ధరించాలని ప్రకటించారు. ప్రస్తుతం యూఏఈ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజుకు 300 లోపే కొత్త కేసులు రావటంతో నిబంధనలు సడలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com