బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
- September 27, 2022
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు. 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డుకు పరేఖ్ ఎంపికయ్యారు. 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ఈ నెల 30న ఫాల్కే అవార్డును పరేఖ్ స్వీకరించనున్నారు.
పదేళ్ల వయసుకే చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆశా పరేఖ్ 1942 అక్టోబర్ 3న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. 1959లో విడుదలైన దిల్ దేకే దేఖో చిత్రంలో ఆమె హీరోయిన్గా మారారు. కతీ పతంగ్, మేరా గావ్ మేరా దేశ్, తీర్సీ మంజిల్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్