బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
- September 27, 2022
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు. 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డుకు పరేఖ్ ఎంపికయ్యారు. 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ఈ నెల 30న ఫాల్కే అవార్డును పరేఖ్ స్వీకరించనున్నారు.
పదేళ్ల వయసుకే చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆశా పరేఖ్ 1942 అక్టోబర్ 3న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. 1959లో విడుదలైన దిల్ దేకే దేఖో చిత్రంలో ఆమె హీరోయిన్గా మారారు. కతీ పతంగ్, మేరా గావ్ మేరా దేశ్, తీర్సీ మంజిల్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







