ఒక్కో పాఠశాల అవసరాలకు 4,000 దీనార్లు: కువైట్ విద్యాశాఖ
- September 27, 2022
కువైట్: కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి బ్యాచ్ స్కూల్ ఫండ్ విడుదలైందని, సంబంధిత ప్రభుత్వ పాఠశాలల ఖాతాల్లో వాటిని జమ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ యూసఫ్ అల్-నజ్జర్ తెలిపారు. ఒక్కో పాఠశాల అవసరాలకు 3,500- 4,000 దీనార్ల మధ్య అందుతాయన్నారు. 75 శాతం కేటాయింపులు పూర్తి చేసినట్లు.. రెండవ దశ చెల్లింపులు (25 శాతం)లను వచ్చే ఏప్రిల్లో పంపిణీ చేయనున్నట్లు అల్-నజ్జర్ వివరించారు. ఈ ఫండ్ పాఠశాల హెడ్ మాస్టర్ ఆధీనంలో ఉంటందన్నారు. ఈ నిధులను స్టేషనరీ, కార్యాలయ సామాగ్రి, వాటర్ ట్యాంక్లు కడగడం, మరుగుదొడ్లు మరమ్మతులు, చిన్నపాటి నిర్వహణ పనులకు ఖర్చు చేయొచ్చన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..