30 శాతం క్రైమ్ రేటు తగ్గటంపై హర్షం వ్యక్తం చేసిన సమాచార శాఖ మంత్రి
- October 01, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లో గత నాలుగేళ్లలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గింది. ఈ అచీవ్ మెంట్ సాధించిన అంతర్గత వ్యవహారాల శాఖ ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా తో పాటు, సిబ్బంది నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైందంటున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా సైతం ఈ అంశంపై స్పందించారు. దేశంలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గటం ఎంతో సంతోషమన్నారు. విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రజల కోసం సిబ్బంది చేసిన త్యాగం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్ లోనూ క్రైమ్ మరింత తగ్గే విధంగా అంతర్గత వ్యవహారాల శాఖ సిబ్బంది, అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







