ఖైతాన్లో ఓ ఈజిప్షియన్ దారుణ హత్య
- October 01, 2022
కువైట్: ఖైతాన్లోని ఓ అపార్ట్మెంట్లో ఒక గుర్తుతెలియని ఈజిప్షియన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపార్ట్మెంట్లోని తెరిచి ఉన్న ఓ ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారని క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. ప్లాట్ లో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించారు. అతన్నిఈజిప్షియన్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బలమైన వస్తువుతో కొట్టడంతో అతడు చనిపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలుగా అతడి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







