దుబాయ్ లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
- October 02, 2022
దుబాయ్: దుబాయ్ లో సింగిరి & కో ఆడిట్ ఫర్మ్ లో జాతిపిత,ప్రపంచ శాంతి కమకులు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గాంధీ పుట్టిన దేశంలో మనం పుట్టడం ప్రపంచం గర్వించదగ్గ విషయమని.ప్రపంచ దేశాలకు సంగతి మార్గాన్ని చూపిన మహనీయుని పుట్టినరోజు దుబాయ్ లో జరుపుకోవడం భారతీయులుగా గర్వించ దగ్గ విషయమని,కుల మత వర్గ రహితంగా స్వాతంత్ర్యం వైపునకు పరుగులు పెట్టించిన గొప్ప మానవతావాది అని, అయన ప్రతిమాట, ప్రతి అడుగు ఆచరణీయం అని చెప్పారు.దుబాయ్ లో మొదట సారి మహాత్ముని పుట్టినరోజు చేయడం గొప్ప విషయమని నిర్వాహకులు తెలిపారు.అనంతరం మహాత్మా గాంధీ జన్మదిన కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రవాసీయులు డాక్టర్ ముక్కు తులసి కుమార్,సింగిరి రవి కుమార్,కసారం రమేష్,గరగపర్తి రాంకీ, తడివాక రమేష్ నాయుడు,సురేష్ గంధం,కోడి రవికిరణ్,గోపి బర్మా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







