మక్కాకు వెళుతుండగా ప్రమాదం.. 27 మంది యాత్రికులకు గాయాలు

- October 04, 2022 , by Maagulf
మక్కాకు వెళుతుండగా ప్రమాదం.. 27 మంది యాత్రికులకు గాయాలు

సౌదీ: పవిత్ర నగరమైన మక్కాకు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 27 మంది యాత్రికులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రి తరలించినట్లు సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. పశ్చిమ నగరం తైఫ్‌లో 50 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా ప్రమాదానికి గురైందని వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వైద్య సహాయం అందించాయన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 27 మందిని ఎనిమిది అంబులెన్స్ ల ద్వారా సమీపంలోని వైద్య సదుపాయాలకు తరలించినట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, అయితే బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడిందని రెడ్ క్రెసెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com