ట్రక్కులు ఢీకొని ఇద్దరు ఈజిప్షియన్లు మృతి

- October 06, 2022 , by Maagulf
ట్రక్కులు ఢీకొని ఇద్దరు ఈజిప్షియన్లు మృతి

కువైట్: సబా అల్-అహ్మద్ ప్రాంతంలో రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఈజిప్షియన్లు మరణించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు ట్రక్కలు ఢీకొన్న ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, భద్రత, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. ఓ ట్రక్కు  డ్రైవర్, అతని సహచరుడు అప్పటికే  గాయాలతో మరణించారని, మరో ట్రక్కు డ్రైవర్‌కు గాయాలవ్వగా సమీప ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతులను ఈజిప్షియన్లుగా గుర్తించామన్నారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదన్నారు. భద్రత, అగ్నిమాపక సిబ్బంది.. రెండు ట్రక్కులను రోడ్డుపై నుండి తొలగించి వాహనాల రాకపోకలను కోసం క్లియర్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com