యూఏఈ వెళ్లే భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం..
- October 06, 2022
యూఏఈ: యూఏఈ వెళ్లే 70 దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది. ఇక గల్ఫ్ దేశాల పౌరులకు యూఏఈ వెళ్లేందుకు వీసా అవసరం లేదు. వారికి ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. కనుక యూఏఈ వెళ్లే 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉన్న 70 దేశాలతో పాటు GCC దేశాల వారికి వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, మిగత దేశాల వారికి తప్పనిసరిగా ప్రీ-ట్రావెల్ వీసా కావాల్సిందే. ఇక భారతీయుల విషయానికి వస్తే.. మనోళ్లకు సాధారణ ఇండియన్ పాస్పోర్టు తో పాటు యూఎస్ జారీ చేసిన విజిట్ వీసా లేదా అమెరికన్ గ్రీన్కార్డు లేదా బ్రిటన్ జారీ చేసిన రెసిడెన్సీ వీసా లేదా ఈయూ నివాస వీసా ఉండాలి. ఈ నాలుగు సందర్భాల్లో మాత్రమే భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉంటుంది.
ఇక ఇలా పొందిన వీసాతో ఆ దేశంలో 14 రోజుల పాటు బస చేసేందుకు వీలు ఉంటుంది. అలాగే మరో 14 రోజుల పాటు వీసా వాలీడిటిని పొడిగించుకునే వెసులుబాటు కూడా వీసాదారులకు ఉంది. ఇలా మొత్తంగా ఆ వీసాపై 28 రోజుల పాటు యూఏఈలో ఉండొచ్చు. అయితే, ఈ వీసా పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటంటే.. వీసాదారుడి పాస్పోర్ట్ తప్పకుండా 6 నెలల వాలీడిటిని కలిగి ఉండాలి.అలాగే యూఎస్, ఈయూ, యూకే రెసిడెన్సీ వీసాల గడువు కూడా 6 నెలలు ఉండాల్సిందే. వీసాదారుడు యూఏఈలో కాలుపెట్టినప్పటి నుంచి వాటి గడువులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.ఇక వీసా కాస్ట్ వచ్చేసి 14 రోజులకు గాను 120 దిర్హాములు ఉంటుంది. మరో 14 రోజులు పొడిగించుకునేందుకు అదనంగా 250 దిర్హాములు చెల్లించాలి.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







