కార్మిక శాఖ ఈపీఎఫ్ నియమావళిని సరళీకరించింది
- April 19, 2016
ఉద్యోగులకు భారీ ఊరట. కార్మిక శాఖ ఈపీఎఫ్ నియమావళిని సరళీకరించింది. పీఎఫ్ను విత్డ్రా చేసే అంశంలో కొన్ని ఆంక్షలను ఆ శాఖ తొలిగించినట్లు తెలుస్తోంది. ఇండ్ల నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత విద్య కోసం పీఎఫ్ను విత్డ్రా చేసుకునే వెసలుబాటును కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద వచ్చే ఉద్యోగులకు ఈ నియమావళి వర్తించనుంది. ఆగస్టు 2016 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. విత్డ్రా చేసుకునే రోజున ఉద్యోగి అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బును అతను పొందాలే నియమావళిని సరళీకరిస్తున్నారు. అంతేకాదు ఆ రోజు వరకు ఆ మొత్తం డబ్బుపై వచ్చే వడ్డీని కూడా ఇవ్వనున్నారు. ఇండ్ల నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల చదువు కోసం అయితేనే ఆ పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ప్రభుత్వ ప్రతిపాదనను ఇంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మొదట్లో తోసిపుచ్చింది. నూరు శాతం పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసే అవకాశాన్ని ఆ సంస్థ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ మళ్లీ ఆంక్షలను సడలించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







