కార్మిక శాఖ ఈపీఎఫ్ నియమావళిని సరళీకరించింది
- April 19, 2016
ఉద్యోగులకు భారీ ఊరట. కార్మిక శాఖ ఈపీఎఫ్ నియమావళిని సరళీకరించింది. పీఎఫ్ను విత్డ్రా చేసే అంశంలో కొన్ని ఆంక్షలను ఆ శాఖ తొలిగించినట్లు తెలుస్తోంది. ఇండ్ల నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత విద్య కోసం పీఎఫ్ను విత్డ్రా చేసుకునే వెసలుబాటును కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద వచ్చే ఉద్యోగులకు ఈ నియమావళి వర్తించనుంది. ఆగస్టు 2016 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. విత్డ్రా చేసుకునే రోజున ఉద్యోగి అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బును అతను పొందాలే నియమావళిని సరళీకరిస్తున్నారు. అంతేకాదు ఆ రోజు వరకు ఆ మొత్తం డబ్బుపై వచ్చే వడ్డీని కూడా ఇవ్వనున్నారు. ఇండ్ల నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల చదువు కోసం అయితేనే ఆ పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ప్రభుత్వ ప్రతిపాదనను ఇంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మొదట్లో తోసిపుచ్చింది. నూరు శాతం పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసే అవకాశాన్ని ఆ సంస్థ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ మళ్లీ ఆంక్షలను సడలించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







