కార్మిక శాఖ ఈపీఎఫ్ నియమావళిని సరళీకరించింది
- April 19, 2016ఉద్యోగులకు భారీ ఊరట. కార్మిక శాఖ ఈపీఎఫ్ నియమావళిని సరళీకరించింది. పీఎఫ్ను విత్డ్రా చేసే అంశంలో కొన్ని ఆంక్షలను ఆ శాఖ తొలిగించినట్లు తెలుస్తోంది. ఇండ్ల నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత విద్య కోసం పీఎఫ్ను విత్డ్రా చేసుకునే వెసలుబాటును కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద వచ్చే ఉద్యోగులకు ఈ నియమావళి వర్తించనుంది. ఆగస్టు 2016 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. విత్డ్రా చేసుకునే రోజున ఉద్యోగి అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బును అతను పొందాలే నియమావళిని సరళీకరిస్తున్నారు. అంతేకాదు ఆ రోజు వరకు ఆ మొత్తం డబ్బుపై వచ్చే వడ్డీని కూడా ఇవ్వనున్నారు. ఇండ్ల నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల చదువు కోసం అయితేనే ఆ పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ప్రభుత్వ ప్రతిపాదనను ఇంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మొదట్లో తోసిపుచ్చింది. నూరు శాతం పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసే అవకాశాన్ని ఆ సంస్థ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ మళ్లీ ఆంక్షలను సడలించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..