ఆ రొయ్యల వినియోగంపై నిషేధం విధించిన ఖతార్
- October 08, 2022
దోహా: దిగుమతి రొయ్యల వినియోగంపై ఖతార్ నిషేధం విధించింది. దిగుమతి చేసుకున్న రొయ్యలలో కొంత పరిమాణంలో కలుషితమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు తమ ఫుడ్ లేబొరేటరీల విశ్లేషణలో తేలిందని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను మార్కెట్ నుంచి నిషేధించినట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లలో ఉన్న స్టాకును ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అలాగే గత మూడు రోజుల్లో మార్కెట్ నుంచి భారత్ భారతీయ రొయ్యలను కొనుగోలు చేసినట్లయితే, దానిని వినియోగించవద్దని మంత్రిత్వ శాఖ వినియోగదారులకు పిలుపునిచ్చింది. ఒకవేళ ఇప్పటికే తిన్న సందర్భంలో గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!







