6 నెలల్లో ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన 10వేల మంది కువైటీలు

- October 09, 2022 , by Maagulf
6 నెలల్లో ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన 10వేల మంది కువైటీలు

కువైట్ సిటీ: ఈ ఏడాది మొదటి 6 నెలల్లో ప్రభుత్వం దాదాపు 10,000 మంది పురుష, మహిళా పౌరులను నియమించినట్లు అధికారిక గణాంకాల  చెబుతున్నాయి. వాటి ప్రకారం.. 9786 మంది పౌరులు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర-అనుబంధ సంస్థలు, కంపెనీలలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా విద్య, విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖల్లో అత్యధిక ఉద్యోగులను నియమించారు. అయితే ఆ తర్వాత 1454 మంది పౌరులు ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. జనవరి నుండి జూన్ చివరి వరకు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పౌరుల సంఖ్యలో నికర పెరుగుదల 8,332 మందిగా ఉంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ యజమానుల ప్రాథమిక డేటా ఇప్పుడు “ఆశల్” సర్వీసు, ఇతర ఎలక్ట్రానిక్ సర్వీసుల్లో  అందుబాటులో ఉందని అథారిటీ  ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com