సౌదీ.. స్కూల్ బస్సులో బాలుడి మృతిపై విద్యాశాఖ సీరియస్
- October 11, 2022
            మక్కా: తూర్పు సౌదీ అరేబియాలోని ఖతీఫ్లోని హలత్ మహిష్ పట్టణంలో ఆదివారం పాఠశాల బస్సులో 5 ఏళ్ల బాలుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో విషాద వాతారణం నెలకొన్నది. ఆదివారం అల్-నఖీల్ కిండర్ గార్టెన్కు వెళ్లాల్సిన బస్సులో హసన్ హషీమ్ అల్-షోలా అనే బాలుడు మరణించిన ఘటనపై విచారణ జరుగుతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ‘‘స్కూల్ నుంచి ఉదయం 11:20 గంటలకు తన కొడుకు ఆ రోజు పాఠశాలకు ఎందుకు రాలేదని ఫోన్ వచ్చింది. నేను షాకయ్యాను. ఉదయం తామే స్వయంగా తమ కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించాం. అనంతరం స్కూల్ బస్సులో హసన్ కదలకుండా పడి ఉన్నాడని తెలిపారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసకుపోవాలని సూచించాం. అప్పటికే తమ కుమారుడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.’’ అని హసన్ తండ్రి హషీమ్ అల్-షోలా వాపోయాడు. తరగతులు ప్రారంభమైన వెంటనే స్కూల్ యాజమాన్యం మమ్మల్ని సంప్రదించి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదన్నారు. మరోవైపు తూర్పు ప్రావిన్స్లోని విద్యా శాఖ హసన్ కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, వాహనంలో విద్యార్థులు ఎవరూ లేరని నిర్ధారించుకోవడంలో విఫలమయ్యాడని స్పష్టంగా తెలుస్తుందని డిపార్ట్మెంట్ ప్రతినిధి సయీద్ అల్-బహెస్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 







