భారతీయ విద్యార్థులకు శుభవార్త ..
- October 12, 2022
చైనా: రెండేళ్లుగా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పింది చైనా. దాదాపు 1,300 మందికిపైగా భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2020లో కోవిడ్ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.
ఆ సమయంలో చైనాలో చదువుకుంటున్న వేలాదిమంది భారతీయులు ఇండియా తిరిగొచ్చారు. చదువు మధ్యలోనే ఆపేసి, దేశానికి తిరిగొచ్చారు. ఆ సమయంలో అక్కడ అన్ని విద్యా సంస్థల్ని మూసేశారు. అయితే, గతంతో పోలిస్తే చైనాలో ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అలాగే విద్యాసంస్థలు ఎప్పట్లానే కొనసాగుతున్నాయి. దీంతో చైనా నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు.. తిరిగి చైనా వెళ్లాలనుకుంటున్నారు. కానీ, చైనా రెండేళ్లుగా వీసాలు మంజూరు చేయడం లేదు. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్ని అనుమతించడంలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేకసార్లు ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లింది.
అయినా, చైనా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాజాగా 1,300 మంది విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. చైనాలో భారతీయులు ఎక్కువగా వైద్య విద్య చదువుకుంటారు. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం.. దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు చైనా యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. మిగతా వారికి వీసాలు ఎప్పుడు మంజూరు చేస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







