భారతీయ విద్యార్థులకు శుభవార్త ..
- October 12, 2022
చైనా: రెండేళ్లుగా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పింది చైనా. దాదాపు 1,300 మందికిపైగా భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2020లో కోవిడ్ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.
ఆ సమయంలో చైనాలో చదువుకుంటున్న వేలాదిమంది భారతీయులు ఇండియా తిరిగొచ్చారు. చదువు మధ్యలోనే ఆపేసి, దేశానికి తిరిగొచ్చారు. ఆ సమయంలో అక్కడ అన్ని విద్యా సంస్థల్ని మూసేశారు. అయితే, గతంతో పోలిస్తే చైనాలో ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అలాగే విద్యాసంస్థలు ఎప్పట్లానే కొనసాగుతున్నాయి. దీంతో చైనా నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు.. తిరిగి చైనా వెళ్లాలనుకుంటున్నారు. కానీ, చైనా రెండేళ్లుగా వీసాలు మంజూరు చేయడం లేదు. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్ని అనుమతించడంలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేకసార్లు ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లింది.
అయినా, చైనా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాజాగా 1,300 మంది విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. చైనాలో భారతీయులు ఎక్కువగా వైద్య విద్య చదువుకుంటారు. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం.. దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు చైనా యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. మిగతా వారికి వీసాలు ఎప్పుడు మంజూరు చేస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
తాజా వార్తలు
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ 2 ప్రారంభం
- 2026 జూన్ 1 నుంచి యూఏఈ ప్రైవేట్ రంగానికి ఏకీకృత జీతాల గడువు అమలు
- ఫేక్ ఉద్యోగాల పేరిట మహిళలను ఆకర్షించి, లైంగిక దోపిడీ..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. యూఏఈ, ఈజిప్టులతో సౌదీ చర్చలు..!!
- కువైట్ లో 'WAMD' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!
- సీబీఎస్ఈ తాజా నిబంధన నుండి యూఏఈ స్కూళ్లకు మినహాయింపు..!!
- లోకల్ తేనె విక్రయాలపై అవేర్ నెస్ వర్క్ షాప్..!!
- ఒమానీ రియాల్కు 250 మార్కును దాటిన రూపాయి..!!
- మోదీ, ఉల్ఫ్ ఉల్ఫ్ క్రిస్టర్సన్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంగీకారం
- హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే..









