భారతీయ విద్యార్థులకు శుభవార్త ..
- October 12, 2022
చైనా: రెండేళ్లుగా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పింది చైనా. దాదాపు 1,300 మందికిపైగా భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2020లో కోవిడ్ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.
ఆ సమయంలో చైనాలో చదువుకుంటున్న వేలాదిమంది భారతీయులు ఇండియా తిరిగొచ్చారు. చదువు మధ్యలోనే ఆపేసి, దేశానికి తిరిగొచ్చారు. ఆ సమయంలో అక్కడ అన్ని విద్యా సంస్థల్ని మూసేశారు. అయితే, గతంతో పోలిస్తే చైనాలో ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అలాగే విద్యాసంస్థలు ఎప్పట్లానే కొనసాగుతున్నాయి. దీంతో చైనా నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు.. తిరిగి చైనా వెళ్లాలనుకుంటున్నారు. కానీ, చైనా రెండేళ్లుగా వీసాలు మంజూరు చేయడం లేదు. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్ని అనుమతించడంలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేకసార్లు ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లింది.
అయినా, చైనా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాజాగా 1,300 మంది విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. చైనాలో భారతీయులు ఎక్కువగా వైద్య విద్య చదువుకుంటారు. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం.. దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు చైనా యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. మిగతా వారికి వీసాలు ఎప్పుడు మంజూరు చేస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









