కువైట్ లో భారత రాయబారిగా డాక్టర్ ఆదర్శ్ స్వైకా నియామకం

- October 12, 2022 , by Maagulf
కువైట్ లో భారత రాయబారిగా డాక్టర్ ఆదర్శ్ స్వైకా నియామకం

కువైట్: కువైట్ లో భారత రాయబారిగా డాక్టర్ ఆదర్శ్ స్వైకా నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. 2002 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన డాక్టర్ ఆదర్శ్ విదేశాంగ శాఖ పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. కువైట్ లో భారత రాయబారిగా ఎంపిక కావటంతో కొన్ని రోజుల్లోనే ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com