ఫోర్జరీ కేసులో గవర్నమెంట్ టీచర్ కు ఏడాది శిక్ష విధించిన కోర్టు
- October 15, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో అటెండెన్స్, స్టూడెంట్స్ స్టడీ రిపోర్ట్ కు సంబంధించి ఫోర్జరీకి పాల్పడిన టీచర్ కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత ఆ టీచర్ ను నగర బహిష్కరణ చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే 2018 లో బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో పిల్లల అటెండెన్స్ రిపోర్ట్ ను ఫోర్జరీ చేశాడు. అదే విధంగా స్టడీ రిపోర్ట్స్ ను కూడా తప్పుగా చూపుతూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ విద్యాశాఖ కు కంప్లైంట్ చేశాడు. దీంతో విచారణ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించారు. ఈ విచారణలో టీచర్ తప్పు చేసినట్లు నిర్ధారణ కావటంతో అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో దోషిగా తేలటంతో ఆ టీచర్ కు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!