కువైట్ 4వ వాణిజ్య భాగస్వామి భారత్
- October 18, 2022
కువైట్: కువైట్ నాల్గవ వాణిజ్య భాగస్వామిగా భారతదేశం నిలిచిందని ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ సభ్యుడు తలాల్ అల్-ఖరాఫీ తెలిపారు. గత ఏడాది USD 2.362 బిలియన్ల విలువైన ట్రేడ్ ఎక్స్ఛేంజీ రెండు దేశాల మధ్య జరిగిందని పేర్కొన్నారు. చాంబర్ హెడ్క్వార్టర్స్లో భారత ప్రతినిధి బృందానికి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో తలాల్ అల్-ఖరాఫీ పాల్గొని మాట్లాటారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలతో ఆర్థిక, వాణిజ్యం ముడిపడి ఉన్నాయన్నారు. భారత అధికారులు కువైట్తో అత్యున్నత స్థాయి వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేయాలని, రెండు దేశాల వ్యాపారులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. భారత ప్రతినిధి బృందానికి బరిష్ మితా సారథ్యం వహించారు. భారత ప్రతినిధి బృందంలో ఆహారం, దుస్తులు, ఉక్కు కర్మాగారాలు, బట్టలు, ఎరువుల తదితర రంగాలకు చెందిన 25 కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







