కువైట్ 4వ వాణిజ్య భాగస్వామి భారత్
- October 18, 2022
కువైట్: కువైట్ నాల్గవ వాణిజ్య భాగస్వామిగా భారతదేశం నిలిచిందని ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ సభ్యుడు తలాల్ అల్-ఖరాఫీ తెలిపారు. గత ఏడాది USD 2.362 బిలియన్ల విలువైన ట్రేడ్ ఎక్స్ఛేంజీ రెండు దేశాల మధ్య జరిగిందని పేర్కొన్నారు. చాంబర్ హెడ్క్వార్టర్స్లో భారత ప్రతినిధి బృందానికి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో తలాల్ అల్-ఖరాఫీ పాల్గొని మాట్లాటారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలతో ఆర్థిక, వాణిజ్యం ముడిపడి ఉన్నాయన్నారు. భారత అధికారులు కువైట్తో అత్యున్నత స్థాయి వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేయాలని, రెండు దేశాల వ్యాపారులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. భారత ప్రతినిధి బృందానికి బరిష్ మితా సారథ్యం వహించారు. భారత ప్రతినిధి బృందంలో ఆహారం, దుస్తులు, ఉక్కు కర్మాగారాలు, బట్టలు, ఎరువుల తదితర రంగాలకు చెందిన 25 కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్









