కువైట్ 4వ వాణిజ్య భాగస్వామి భారత్
- October 18, 2022
కువైట్: కువైట్ నాల్గవ వాణిజ్య భాగస్వామిగా భారతదేశం నిలిచిందని ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ సభ్యుడు తలాల్ అల్-ఖరాఫీ తెలిపారు. గత ఏడాది USD 2.362 బిలియన్ల విలువైన ట్రేడ్ ఎక్స్ఛేంజీ రెండు దేశాల మధ్య జరిగిందని పేర్కొన్నారు. చాంబర్ హెడ్క్వార్టర్స్లో భారత ప్రతినిధి బృందానికి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో తలాల్ అల్-ఖరాఫీ పాల్గొని మాట్లాటారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలతో ఆర్థిక, వాణిజ్యం ముడిపడి ఉన్నాయన్నారు. భారత అధికారులు కువైట్తో అత్యున్నత స్థాయి వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేయాలని, రెండు దేశాల వ్యాపారులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. భారత ప్రతినిధి బృందానికి బరిష్ మితా సారథ్యం వహించారు. భారత ప్రతినిధి బృందంలో ఆహారం, దుస్తులు, ఉక్కు కర్మాగారాలు, బట్టలు, ఎరువుల తదితర రంగాలకు చెందిన 25 కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







