తీవ్రవాదులకి ఉరిశిక్ష వెయ్యాల్సిందే

- April 20, 2016 , by Maagulf
తీవ్రవాదులకి ఉరిశిక్ష వెయ్యాల్సిందే

బహ్రెయిన్‌లో తీవ్రవాదులకు ఉరిశిక్ష విధించాలంటూ ఎంపీ జమాల్‌ బుహాసన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితే సంబంధిత మంత్రిత్వ శాఖ బుహాసన్‌ డిమాండ్‌పై ఎలా స్పందించిందీ తెలియరాలేదు. తీవ్రవాదులు సమాజానికి శాపంగా మారారనీ, బహ్రెయిన్‌ మాత్రమే కాకుండా ప్రపంచమంతా తీవ్రవాద పీడిత ప్రాంతమేనని బుహాసన్‌ చెప్పారు. తీవ్రవాదులకు మతం లేదు, మానవత్వం లేదు. అలాంటివారిపై కఠిన చర్య అంటే అది ఉరిశిక్ష మాత్రమేనని ఆయన అన్నారు. మానవ హక్కులు అనే కోణంలో తీవ్రవాదుల గురించి ఆలోచించరాదని అన్నారాయన. సరైన శిక్షలు లేకపోవడంతో తీవ్రవాద నేరాలు పెరిగిపోతున్నాయని బుహాసన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com