భార్య పై భర్త సివిల్ దావా: Dh500,000 చెల్లించాలని డిమాండ్
- October 20, 2022
అబుధాబి: నగలు దొంగిలించాడని ఆరోపించిన భార్యపై ఓ భర్త 500,000 దిర్హామ్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేసిన సివిల్ దావాను కోర్టు కొట్టివేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. అబుభాబి రెసిడెంట్ పై తన భార్య ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించాడని ఆరోపించింది. కానీ అబుధాబి క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్, అప్పీల్స్ కోర్ట్ రెండూ తగిన సాక్ష్యం లేని కారణంగా భర్తపై నమోదైన ఆరోపణలను కొట్టివేశాయి. అనంతరం తన భార్య చర్య తన ప్రతిష్టను దెబ్బతీసిందని, భౌతిక, నైతిక నష్టాలను ఎదుర్కొన్నట్లు భర్త పరిహారం కోరుతూ ఆమెపై సివిల్ దావా వేశాడు. రెండు కోర్టులు ఇచ్చిన తీర్పుల కాపీలను కోర్టుకు సమర్పించాడు. అయితే, భర్త విషయంలో సదరు మహిళ(అతని భార్య) చట్టబద్ధంగా వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడింది. భర్త ప్రతిష్ట దెబ్బతిన్నదని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పరిహారం వాదనలను తిరస్కరించి, కేసును కొట్టివేసింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







