18,427 మంది అక్రమ నివాసితుల స్టేటస్ సర్దుబాటు
- October 21, 2022
కువైట్: 2011 నుండి సెప్టెంబర్ 2022 చివరి వరకు 18,427 మంది చట్టవిరుద్ధమైన నివాసితుల స్థితిని (బెడౌన్) ను సర్దుబాటు చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ద స్టేటస్ అడ్జస్ట్ మెంట్ డిపార్టుమెంట్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ అల్-వాహిబ్ తెలిపారు. 9,372 మంది అక్రమ నివాసితులు అన్ని రాష్ట్ర ఏజెన్సీలలో తమ స్థితిని సర్దుబాటు చేయడానికి విధానాలను పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇందులో 12,901 మంది సౌదీ జాతీయత కలిగి ఉన్నారని, వీరిలో 5,945 మంది రాష్ట్ర ఏజెన్సీలలో తమ స్థితిని సర్దుబాటు చేయడానికి విధానాలను పూర్తి చేశారని, మరో 6,956 మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఆ తర్వాత 1,835 మంది వ్యక్తులు ఇరాకీ జాతీయత, 858 మంది సిరియన్ జాతీయత, ఇరాన్ జాతీయతకు చెందిన 318 మంది వ్యక్తులు, జోర్డాన్ జాతీయతకు చెందిన 116 మంది.. వీటితోపాటు ఇతర దేశాలకు చెందిన 2155 మంది వ్యక్తుల స్టేటస్ ను సవరించినట్లు అల్-వాహిబ్ వివరించారు. కువైట్లో అమలులో ఉన్న నివాస చట్టాల ప్రకారం తన నివాసాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి, తమ స్టేటస్(స్థితి)ని పునరుద్దరించుకోవడానికి అల్-అర్దియా ప్రాంతంలోని శివారు ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని అల్-వాహిబ్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..