కేజీ బంగారం దోచుకెళ్లిన నకిలీ పోలీసుల ముఠా
- October 23, 2022
దుబాయ్: పోలీసు అధికారులమంటూ ఓ ఆసియా వ్యక్తి నుంచి 1 కేజీ బంగారాన్ని దోచుకున్న నలుగురు వ్యక్తుల ముఠాకు దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దొంగిలించబడిన బంగారం విలువ Dh215,000 ను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత ఫిబ్రవరిలో గల్ఫ్ దేశస్థుడితో సహా నలుగురు వ్యక్తుల ముఠా తనను దోచుకున్నట్లు ఒక ఆసియా వ్యక్తి నివేదించాడు. నిందితుల్లో ఒకరి నుంచి తనకు ఫోన్ వచ్చిందని, నగల వ్యాపారినని పరిచయం చేసుకున్నారని బాధితుడు తెలిపాడు. తన వద్ద ఉన్న బంగారు కడ్డీని కొంటామని, కరామాలోని నగల దుకాణం దగ్గరికి రావాలని కోరారు. దీంతో బాధితుడు తన దగ్గర ఉన్న బంగారు కడ్డీని తీసుకొని నిందితులు చెప్పిన ప్రదేశానికి వెళ్లగా.. నిందితుల ముఠా బాధితుడిపై దాడి చేసి బంగారు కడ్డీని అపహరించారు. అనంతరం పోలీసులు ఆశ్రయించగా.. నేరానికి ఉపయోగించిన వాహనం ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!







