కేజీ బంగారం దోచుకెళ్లిన నకిలీ పోలీసుల ముఠా
- October 23, 2022
దుబాయ్: పోలీసు అధికారులమంటూ ఓ ఆసియా వ్యక్తి నుంచి 1 కేజీ బంగారాన్ని దోచుకున్న నలుగురు వ్యక్తుల ముఠాకు దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దొంగిలించబడిన బంగారం విలువ Dh215,000 ను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత ఫిబ్రవరిలో గల్ఫ్ దేశస్థుడితో సహా నలుగురు వ్యక్తుల ముఠా తనను దోచుకున్నట్లు ఒక ఆసియా వ్యక్తి నివేదించాడు. నిందితుల్లో ఒకరి నుంచి తనకు ఫోన్ వచ్చిందని, నగల వ్యాపారినని పరిచయం చేసుకున్నారని బాధితుడు తెలిపాడు. తన వద్ద ఉన్న బంగారు కడ్డీని కొంటామని, కరామాలోని నగల దుకాణం దగ్గరికి రావాలని కోరారు. దీంతో బాధితుడు తన దగ్గర ఉన్న బంగారు కడ్డీని తీసుకొని నిందితులు చెప్పిన ప్రదేశానికి వెళ్లగా.. నిందితుల ముఠా బాధితుడిపై దాడి చేసి బంగారు కడ్డీని అపహరించారు. అనంతరం పోలీసులు ఆశ్రయించగా.. నేరానికి ఉపయోగించిన వాహనం ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









