ఇండియన్ ఎంబసీలో ఘనంగా 7వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు
- October 26, 2022
కువైట్: ధన్వతరి జయంతిని పురస్కరించుకొని భారత రాయబార కార్యాలయం 7వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంది. కువైట్ లోని ఎంబసీ ప్రాంగణంలో అక్టోబర్ 23న 7వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కువైట్లోని భారత రాయబారి HE సిబి జార్జ్ తరపున ప్రథమ కార్యదర్శి (సంస్కృతి), డాక్టర్ వినోద్ గైక్వాడ్ పాల్గొని మాట్లాడారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కువైట్లోని భారతీయులందరికీ, కువైట్లోని భారతీయ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయుర్వేదం ప్రకృతితో మనిషి అనుబంధాన్ని తెలియజేస్తోందన్నారు. ఈ సంవత్సరం ‘హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదం’ ఇతివృత్తంతో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో యోగా, ఆయుర్వేదం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఆదరణ పొందుతున్నాయని డాక్టర్ వినోద్ గైక్వాడ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









