ఇండియన్ ఎంబసీలో ఘనంగా 7వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు
- October 26, 2022
కువైట్: ధన్వతరి జయంతిని పురస్కరించుకొని భారత రాయబార కార్యాలయం 7వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంది. కువైట్ లోని ఎంబసీ ప్రాంగణంలో అక్టోబర్ 23న 7వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కువైట్లోని భారత రాయబారి HE సిబి జార్జ్ తరపున ప్రథమ కార్యదర్శి (సంస్కృతి), డాక్టర్ వినోద్ గైక్వాడ్ పాల్గొని మాట్లాడారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కువైట్లోని భారతీయులందరికీ, కువైట్లోని భారతీయ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయుర్వేదం ప్రకృతితో మనిషి అనుబంధాన్ని తెలియజేస్తోందన్నారు. ఈ సంవత్సరం ‘హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదం’ ఇతివృత్తంతో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో యోగా, ఆయుర్వేదం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఆదరణ పొందుతున్నాయని డాక్టర్ వినోద్ గైక్వాడ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







