ఖతార్లో 40% ఉపాధ్యాయులకు వృత్తిపరమైన లైసెన్స్లు
- October 26, 2022
దోహా: ఖతార్లో దాదాపు 40 శాతం మంది ఉపాధ్యాయులు ప్రొఫెషనల్ లైసెన్స్లు పొందారని విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.ఉపాధ్యాయులు, పాఠశాల నాయకుల కోసం ప్రొఫెషనల్ లైసెన్సింగ్ సిస్టమ్తో సహా అనేక సిస్టమ్లు, ప్రోగ్రామ్ల అప్లికేషన్ ద్వారా ఉపాధ్యాయుల పనితీరు స్థాయిని, విద్యార్థుల సాధనను పెంచడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉందని విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖలోని ఉపాధ్యాయ వ్యవహారాల విభాగం డైరెక్టర్ అహ్మద్ అల్ జెసైమానీ తెలిపారు. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన లైసెన్స్లు జాతీయ వృత్తిని నిర్ధారిస్తూ, జాగ్రత్తగా ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత మంజూరు చేయబడుతుందన్నారు. ప్రమాణాలు, వృత్తిపరమైన లైసెన్స్, ఉద్యోగ ప్రమోషన్ లకు ఈ లైసెన్సులు ప్రతిపాదికగా నిలుస్తాయన్నారు. ఉపాధ్యాయ వ్యవహారాల విభాగం సహకారంతో విద్యా శిక్షణ, అభివృద్ధి కేంద్రం వరుసగా ఏడవ సంవత్సరం నిర్వహించిన “తమ్కీన్” శిక్షణా కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ పని చేస్తోందని అల్ జెసైమానీ సూచించారు. బోధన అనుభవం లేని ఖతార్ విశ్వవిద్యాలయం, స్థానిక విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లకు ఉపాధ్యాయులు కావడానికి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉందని, వారికి అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలను అందజేస్తున్నట్లు అల్ జెసైమానీ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం







