‘ఊర్వశివో రాక్షసివో’.! గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారే.!
- October 31, 2022
ఈ మధ్య ‘మీర్జాపూర్’ అనే ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ నిండా బూతులే బూతులు. డైరెక్ట్గా మాట్లాడేస్తుంటారు. అయితే, మన టాపిక్ ఈ వెబ్ సిరీస్ కానే కాదండోయ్.
‘ఊర్వశివో రాక్షసివో’ అనే టైటిల్తో అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఈ సినిమా ప్రమోషన్లు తెగ ఊదరగొడుతున్నారు మరి. తెలియకుండా ఎందుకుంటుంది.
అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో అల్లు శిరీష్తో జోడీ కడుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ భీభత్సమైన రొమాంటిక్ సన్నివేశాలతోనే ఈ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు కూడా. ఇక సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి బాలయ్య ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా హిలేరియస్గా వుంది. వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు తమదైన కామెడీ టైమింగ్తో డైలాగులు అదరగొట్టేస్తున్నారు. ఇక, అల్లు శిరీష్ కూడా తనలోని హీరోని సరికొత్తగా పరిచయం చేస్తున్నాడీ సినిమాతో.
అయితే, ట్రైలర్ నిండా డబుల్ మీనింగ్ డైలాగులూ.. సీరియల్ ఆర్టిస్టుల ప్రస్థావనతో పోల్చిన కామెడీ టైమింగులూ.. ఇలా ఆధ్యంతం ఆకట్టుకునేలా వుంది ట్రైలర్. డబుల్ మీనింగ్ డైలాగులతో ట్రైలర్ని నింపేశారు.. అంటూ ఎక్కడ కామెంట్లు వస్తాయో అనుకున్నారో ఏమో.. ఆ డైలాగ్ కూడా ట్రైలర్ చివరలో వెన్నెల కిషోర్తో చెప్పించేసి ఆడియన్స్ ఫోకస్ని మళ్లీ తమవైపు తిప్పేసుకున్నారు. ఆ టైమింగ్లో వెన్నెల కిషోర్ వాడిన పదమే ‘మీర్జాపూర్’. అదీ సంగతి. ఏమో, ట్రైలర్ కట్ చేసిన విధానం చూస్తుంటే, శిరీష్ ఈ సినిమాతో గట్టెక్కేలానే వున్నాడు చూడాలి మరి.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









