ఇండియాలో కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన: బాధితులకు సౌదీ నేతల సంతాపం

- November 02, 2022 , by Maagulf
ఇండియాలో కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన: బాధితులకు సౌదీ నేతల సంతాపం

రియాద్: పశ్చిమ భారతదేశంలోని గుజరాత్‌లో కేబుల్ వంతెన కూలి కనీసం 135 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో బాధితులకు సౌదీ అరేబియా రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ మేరకు భారత అధ్యక్షుడు ద్రౌపది ముర్ముకు ఓ లేఖను పంపారు.

దీపావళి లేదా ఛత్ పూజ సెలవుల నేపథ్యంలో వందలాది మంది సందర్శకులు ఆదివారం సాయంత్రం 230 మీటర్ల పొడవైన కేబుల్ వంతెనపై నిలబడి ఆస్వాదిస్తుండగా.. అది కూలి సందర్శకులు మచ్చు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 135 మంది చనిపోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులే అధికంగా ఉన్నారు.  

గుజరాత్‌లోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్‌కు 200 కి.మీ దూరంలో ఉన్న మోర్బీలోని  ఈ కేబుల్ వంతెనను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో నిర్మించారు. ఇటీవల ఈ కేబుల్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి సందర్శకుల కోసం తెరిచారు. ఇది తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నాలుగు రోజులకే కుప్పకూలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com