ఇండియన్ ఎంబసీలో ‘కర్ణాటక రాజ్యోత్సవ దినోత్సవం’
- November 03, 2022
కువైట్: భారత రాయబార కార్యాలయంలో 'కర్ణాటక రాజ్యోత్సవ' పేరుతో స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్ను కువైట్ ఇండియన్ ఎంబసీ నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక, కళలు, వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను చార్జీ డి'ఎఫైర్స్ స్మితా పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. కర్నాటక రాష్ట్రం ఆర్థిక, పెట్టుబడి, పర్యాటక విశేషాలను వివరించారు. కువైటీలు, భారతీయులు కర్ణాటకను సందర్శించవలసిందిగా కోరారు. బెంగళూరు సిల్క్తో పాటు చందనం, ఫర్నీచర్, సబ్బు, నూనె, టాల్కమ్ పౌడర్, అగరబత్తుల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన కర్ణాటక ఆధునిక పారిశ్రామిక రాష్ట్రమని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉన్న రాష్ట్రమని, భారతదేశంలో కాఫీ భూమిగా పేరుగాంచిందని, సాఫ్ట్వేర్, సేవా ఎగుమతుల సహకారంతో రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మిల్లెట్స్-2023 సంవత్సరాన్ని పురస్కరించుకుని కర్ణాటకకు చెందిన జిఐ (జియోగ్రాఫిక్ ఇండికేటర్స్) ఉత్పత్తులు, మిల్లెట్ ఉత్పత్తులను ఎంబసీలో ప్రదర్శించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







