బెంగళూరుకు నేరుగా విమానాన్ని ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్
- November 05, 2022
కువైట్: భారతదేశంలోని బెంగళూరు నగరానికి జజీరా ఎయిర్వేస్ తన మొదటి డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించింది. జజీరా ఎయిర్వేస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయం నుండి మొదటి కార్యదర్శి డాక్టర్ వినోద్ గైక్వాడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జజీరా ఎయిర్వేస్ అధికారులు, కువైట్లోని వివిధ కర్ణాటక సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు.
కువైట్ విమానాశ్రయం నుండి ఫ్లైట్ నంబర్ J9 431 సాయంత్రం 6:00 గంటలకు బెంగళూరుకు బయలుదేరి 01:15 గంటలకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 02:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 04:50కి కువైట్ చేరుకుంటుంది.
జజీరా విమానం కువైట్ నుండి బెంగళూరుకు గురువారం, శనివారం సాయంత్రం 6:00 గంటలకు రెండు వీకెండ్ సర్వీసులను ఆపరేట్ చేయనుంది. బెంగళూరు నుండి తిరుగు ప్రయాణంలో శుక్రవారం, ఆదివారం తెల్లవారుజామున 2:00 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4:50 గంటలకు కువైట్ చేరుకుంటాయని జజీరా ఎయిర్వేస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







