బెంగళూరుకు నేరుగా విమానాన్ని ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్
- November 05, 2022
కువైట్: భారతదేశంలోని బెంగళూరు నగరానికి జజీరా ఎయిర్వేస్ తన మొదటి డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించింది. జజీరా ఎయిర్వేస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయం నుండి మొదటి కార్యదర్శి డాక్టర్ వినోద్ గైక్వాడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జజీరా ఎయిర్వేస్ అధికారులు, కువైట్లోని వివిధ కర్ణాటక సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు.
కువైట్ విమానాశ్రయం నుండి ఫ్లైట్ నంబర్ J9 431 సాయంత్రం 6:00 గంటలకు బెంగళూరుకు బయలుదేరి 01:15 గంటలకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 02:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 04:50కి కువైట్ చేరుకుంటుంది.
జజీరా విమానం కువైట్ నుండి బెంగళూరుకు గురువారం, శనివారం సాయంత్రం 6:00 గంటలకు రెండు వీకెండ్ సర్వీసులను ఆపరేట్ చేయనుంది. బెంగళూరు నుండి తిరుగు ప్రయాణంలో శుక్రవారం, ఆదివారం తెల్లవారుజామున 2:00 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4:50 గంటలకు కువైట్ చేరుకుంటాయని జజీరా ఎయిర్వేస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









