ఎక్స్పో సిటీ దుబాయ్.. క్రిస్మస్ వేడుకలకు ఫ్రీ ఎంట్రీ
- November 05, 2022
యూఏఈ: వింటర్ సిటీ హాలిడే సీజన్లో అనేక ప్రత్యేక కార్యక్రమాలను ఎక్స్పో సిటీ దుబాయ్ తీసుకొచ్చింది. నవంబర్ 23 నుండి జనవరి 8 వరకు జరిగే వేడుకల కోసం ఎక్స్పో సిటీ దుబాయ్ సిద్ధమైంది. క్రిస్మస్ వేడుకలకు ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పించింది. మొబిలిటీ డిస్ట్రిక్ట్, సర్రియల్ వాటర్ ఫీచర్, అల్ వాస్ల్ ప్లాజా సాంప్రదాయ, చాలెట్-స్టైల్ క్రిస్మస్ మార్కెట్, పైన్ చెట్లు, వినోదభరితమైన ఫెయిర్గ్రౌండ్ గేమ్లు, శాంటా స్టేషన్కి ఉత్తరం లాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు యూఏఈ జాతీయ దినోత్సవ స్మారక కార్యక్రమాలు జరుగుతాయి. డిసెంబర్ 20-29 వరకు ఎక్స్పో 2020 ప్రసిద్ధ మిసెస్ క్లాజ్ క్రిస్మస్ షో రెండవ ఎడిషన్, డిసెంబరు 20-25 వరకు క్యాండిల్లైట్ ద్వారా మొదటి-రకం కరోల్స్, రాత్రిపూట ప్రొజెక్షన్ ప్రదర్శనలను నిర్వహించనున్నారు. 6-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు వింటర్ క్యాంప్(డిసెంబర్ 12-23)లో చేరి ఇండోర్, అవుట్డోర్ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. సోమవారం-శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు సరదాగా గడపవచ్చు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









