ఎక్స్పో సిటీ దుబాయ్.. క్రిస్మస్ వేడుకలకు ఫ్రీ ఎంట్రీ
- November 05, 2022
యూఏఈ: వింటర్ సిటీ హాలిడే సీజన్లో అనేక ప్రత్యేక కార్యక్రమాలను ఎక్స్పో సిటీ దుబాయ్ తీసుకొచ్చింది. నవంబర్ 23 నుండి జనవరి 8 వరకు జరిగే వేడుకల కోసం ఎక్స్పో సిటీ దుబాయ్ సిద్ధమైంది. క్రిస్మస్ వేడుకలకు ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పించింది. మొబిలిటీ డిస్ట్రిక్ట్, సర్రియల్ వాటర్ ఫీచర్, అల్ వాస్ల్ ప్లాజా సాంప్రదాయ, చాలెట్-స్టైల్ క్రిస్మస్ మార్కెట్, పైన్ చెట్లు, వినోదభరితమైన ఫెయిర్గ్రౌండ్ గేమ్లు, శాంటా స్టేషన్కి ఉత్తరం లాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు యూఏఈ జాతీయ దినోత్సవ స్మారక కార్యక్రమాలు జరుగుతాయి. డిసెంబర్ 20-29 వరకు ఎక్స్పో 2020 ప్రసిద్ధ మిసెస్ క్లాజ్ క్రిస్మస్ షో రెండవ ఎడిషన్, డిసెంబరు 20-25 వరకు క్యాండిల్లైట్ ద్వారా మొదటి-రకం కరోల్స్, రాత్రిపూట ప్రొజెక్షన్ ప్రదర్శనలను నిర్వహించనున్నారు. 6-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు వింటర్ క్యాంప్(డిసెంబర్ 12-23)లో చేరి ఇండోర్, అవుట్డోర్ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. సోమవారం-శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు సరదాగా గడపవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







