ట్రక్కు దొంగతనం.. ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానా
- November 05, 2022
దుబాయ్: ఒక ట్రక్కును దొంగిలించి, దానిలోని రాగి లోడును విక్రయించిన ఇద్దరు వ్యక్తులకు దుబాయ్ మిస్డిమినర్ కోర్టు జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఒక ఆసియా డ్రైవర్ తను పనిచేస్తున్న కంపెనీకి చెందిన ట్రక్కును, అందులోని రాగి కేబుల్స్ ని దొంగిలించి.. ఇతరులకు అమ్మాడు. గత ఆగస్టులో షార్జాలో ఈ కేసు నమోదైంది. సదరు కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన డిటెక్టివ్ల బృందం.. ట్రక్కును, అందులోని రాగి కేబుల్స్ ఉన్న ప్రాంతాన్ని కొనుగొన్నది. అనంతరం గుర్తు తెలియన వారి నుంచి ట్రక్కును కొన్న వ్యక్తిని గుర్తించి ట్రక్కను స్వాధీనం చేసుకున్నారు. అతడు అందజేసిన సమాచారంతో ట్రక్కును అమ్మిన డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కేసును విచారించిన కోర్టు.. ట్రక్కను అమ్మిన ఆసియా డ్రైవర్ కు పాటు ఒక సంవత్సరం జైలు శిక్ష, విధుల దుర్వినియోగానికి Dhs80,000 జరిమానా విధించింది. అలాగే గుర్తు తెలియన వ్యక్తుల నుంచి ట్రక్కున కొన్న మరో వ్యక్తికి నెలరోజుల జైలుశిక్ష విధించింది. ఇద్దరు నిందితులు కలిసి ట్రక్కు ఓనరుకు Dhs1.5 మిలియన్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. శిక్ష పూర్తయిన తర్వాత ఇద్దరిని దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









