బహిరంగ పక్షులకు ఆహారం ఇవ్వడం మానుకోండి
- November 07, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాలలో పక్షులకు ఆహారం ఇవ్వడం మానుకోవాలని మస్కట్ మునిసిపాలిటీ సూచించింది. దీని కారణంగా ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించింది. మిగిలిపోయిన ధాన్యాలు, పక్షుల వ్యర్థాలతో కలిసిపోయి కుళ్ళిపోయి.. దుర్వాసన వెదజల్లుతుందని పేర్కొంది. దీని కారణంగా ప్రజలు తమ సమయాన్ని ఆరుబయట గడపకుండా లేదా బహిరంగ కూడళ్లలో క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటుందని మున్సిపాలిటీ తెలిపింది. అంతేకాకుండా పక్షులను పోషించే ఉద్దేశంతో ధాన్యాలను నడక మార్గాలు, కాలిబాటలపై వేయడంతో అక్కడ కీటకాలు, పురుగులు, పరాన్నజీవుల సంఖ్య పెరిగి వాతావరణం కలుషితం అవుతందని, ఇది పురపాలక సిబ్బందిపై అదనపు భారాన్ని మోపుతుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొన్నది.
తాజా వార్తలు
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!









