పర్వతారోహణలో గాయపడిన మహిళను రక్షించిన రెస్క్యూ బృందాలు

- November 08, 2022 , by Maagulf
పర్వతారోహణలో గాయపడిన మహిళను రక్షించిన రెస్క్యూ బృందాలు

మస్కట్: అల్ హమ్రాలోని విలాయత్‌లో పర్వతారోహణలో గాయపడిన మహిళను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) రెస్క్యూ బృందాలు రక్షించాయి. అనంతరం అత్యవసర వైద్యసేవల కోసం ఆస్పత్రికి తరలించాయి. ఈ మేరకు సీడీఏఏ వెల్లడించింది. అల్ హమ్రాలోని విలాయత్‌లో పర్వతారోహణ సమయంలో ఒక మహిళ గాయపడినట్లు వచ్చిన సమాచారంతో అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగంలోని రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాయని, ఆమెకు అత్యవసర వైద్య సంరక్షణ అందించి, అవసరమైన చికిత్సను అందించడానికి ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సీడీఏఏ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com