సౌదీ జాతీయ క్రీడల్లో మెరిసిన తెలుగువాసికి ఘన సన్మానం

- November 10, 2022 , by Maagulf
సౌదీ జాతీయ క్రీడల్లో మెరిసిన తెలుగువాసికి ఘన సన్మానం

సౌదీ: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మహాద్‌ షా, కేరళకు చెందిన ఖదీజాలను సౌదీలోని భారత ఎంబసీ ఘనంగా సన్మానించింది. మహాద్‌ షా, ఖదీజాలు సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో  బ్యాడ్మింటన్‌ విభాగాల్లో ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్స్, చెరో రూ.2.18 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వీరి ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం వీరిద్దరిని ఘనంగా సన్మానించింది.  రియాద్‌లోని భారతీయ ఎంబసీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో తాత్కాలిక రాయబారి ఎన్‌.రాంప్రసాద్‌ విజేతలకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి.. జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ ఎంబసీ అధికారులు, విజేతల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com