మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో నెల రోజుల పాటు జరిగే సింహస్థ కుంభమేళా..
- April 22, 2016
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో నెల రోజుల పాటు జరిగే సింహస్థ కుంభమేళా శుక్రవారం ప్రారంభమైంది. పుణ్యస్నానాల కోసం భక్తులు మొదటి రోజు అధిక సంఖ్యలో పోటెత్తారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. ఉజ్జయినిలో దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వరుడి ఆలయం ఉంది. ఈ కుంభమేళా సందర్భంగా శిప్రా నదీ తీరంలో సాధువులు, భక్తులు ఈరోజు పుణ్యస్నానాలు ఆచరించారు.సింహస్థ కుంభమేళా సందర్భంగా ఉజ్జయినికి సుమారు 5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసారి 'గ్రీన్ సింహస్థ'గా ఉండాలని శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కూడా పుణ్యస్నానం చేశారు. ఈరోజు షాహీ స్నాన్ సందర్భంగా నదీ తీరంలో దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరింపజేసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









