షార్జాలో అభిమానులను అలరించిన షారూఖ్
- November 12, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శన అయిన షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో భారతీయ సినిమా స్టార్ షారుఖ్ ఖాన్ సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది మంది అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా షార్జా బుక్ అథారిటీ (SBA) చైర్మన్ అహ్మద్ అల్ అమేరి.. షారూఖ్ ఖాన్కు మొట్టమొదటి బుక్ ఫెయిర్ గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా అండ్ కల్చరల్ నేరేటివ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ.. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు, SIBF డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని.. యాసిడ్ దాడి బాధితులకు, ధైర్యాన్ని ప్రదర్శించిన మహిళలందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. జీవితంలో నిజాయితీగా ఉండాలని యువకులకు సూచించారు. యూఏఈలోని బహుళసాంస్కృతికత అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. షారూఖ్ నటించిన "పఠాన్" సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..