బహ్రెయిన్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్
- November 13, 2022
మనామా: బహ్రెయిన్లో 2022 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73 శాతం పోలింగ్ నమోదైంది. 2002లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత అత్యధిక శాతం ఓటింగ్ ఇదే. 40-సభ్యుల కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, 30-సభ్యుల మునిసిపాలిటీ కౌన్సిల్లను నాలుగు సంవత్సరాల కాలానికి ఎన్నుకోవడం కోసం శనివారం పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ వివరాలను న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ శాఖ మంత్రి, 2022 ఎన్నికల హైకమిటీ అధిపతి నవాఫ్ బిన్ మహ్మద్ అల్ మువాదా మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అంతరాయం లేకుండా ప్రశాంతంగా సాగిందన్నారు. ఈ సంవత్సరం 40 బహ్రెయిన్ పార్లమెంట్ దిగువ సభ సీట్లకు 561 మంది, 30 మునిసిపల్ కౌన్సిల్ స్థానాలకు 176 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. 2018తో పోలిస్తే ఇది 20 శాతం అధికమని వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







