బహ్రెయిన్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్
- November 13, 2022
మనామా: బహ్రెయిన్లో 2022 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73 శాతం పోలింగ్ నమోదైంది. 2002లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత అత్యధిక శాతం ఓటింగ్ ఇదే. 40-సభ్యుల కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, 30-సభ్యుల మునిసిపాలిటీ కౌన్సిల్లను నాలుగు సంవత్సరాల కాలానికి ఎన్నుకోవడం కోసం శనివారం పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ వివరాలను న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ శాఖ మంత్రి, 2022 ఎన్నికల హైకమిటీ అధిపతి నవాఫ్ బిన్ మహ్మద్ అల్ మువాదా మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అంతరాయం లేకుండా ప్రశాంతంగా సాగిందన్నారు. ఈ సంవత్సరం 40 బహ్రెయిన్ పార్లమెంట్ దిగువ సభ సీట్లకు 561 మంది, 30 మునిసిపల్ కౌన్సిల్ స్థానాలకు 176 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. 2018తో పోలిస్తే ఇది 20 శాతం అధికమని వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







