బహ్రెయిన్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్
- November 13, 2022
మనామా: బహ్రెయిన్లో 2022 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73 శాతం పోలింగ్ నమోదైంది. 2002లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత అత్యధిక శాతం ఓటింగ్ ఇదే. 40-సభ్యుల కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, 30-సభ్యుల మునిసిపాలిటీ కౌన్సిల్లను నాలుగు సంవత్సరాల కాలానికి ఎన్నుకోవడం కోసం శనివారం పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ వివరాలను న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ శాఖ మంత్రి, 2022 ఎన్నికల హైకమిటీ అధిపతి నవాఫ్ బిన్ మహ్మద్ అల్ మువాదా మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అంతరాయం లేకుండా ప్రశాంతంగా సాగిందన్నారు. ఈ సంవత్సరం 40 బహ్రెయిన్ పార్లమెంట్ దిగువ సభ సీట్లకు 561 మంది, 30 మునిసిపల్ కౌన్సిల్ స్థానాలకు 176 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. 2018తో పోలిస్తే ఇది 20 శాతం అధికమని వివరించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







