ముంబై విమానాశ్రయంలో 61 కేజీల బంగారం పట్టివేత..
- November 13, 2022
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 61 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.బంగారం అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ఆదివారం ముంబై, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఈ బంగారాన్ని అధికారులు సొంతం చేసుకున్నారు.
దీని విలువ దాదాపు రూ.32 కోట్లు ఉంటుందని అంచనా.ముంబై విమానాశ్రయం చరిత్రలో ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ ఇంత బంగారం ఒకే రోజు దొరకలేదు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..టాంజానియా నుంచి నలుగురు భారతీయులు ఇండియా తిరిగి వచ్చారు. వాళ్లను అధికారులు తనిఖీ చేయగా ఈ బంగారం విషయం బయటపడింది. వీళ్లు ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన బెల్టు ధరించి వచ్చారు. వాటిని పూర్తిగా శరీరానికి చుట్టుకుని తీసుకొచ్చారు.వాటి లోపల చిన్న పాకెట్లలో బంగారం ఉంది.ఇలా మొత్తం ఈ నలుగురు ప్యాసింజర్ల నుంచి మొత్తం 53 కేజీల బరువున్న, రూ.28 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారం యూఏఈలో తయారైనట్లు అధికారులు గుర్తించారు.
వీరిని అదుపులోకి తీసుకుని, 14 రోజుల రిమాండ్కు పంపించారు. సౌదీకి చెందిన కొందరు వ్యక్తులు వారికి ఈ బెల్టులను దోహాలో అందించినట్లు చెప్పారు. మరో ఘటనలో దుబాయ్ నుంచి వస్తున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి 8 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.88 కోట్లు ఉంటుందని అంచనా.ఈ ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో ఒక మహిళ వయసు 60 ఏళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







