ఖైబర్‌లో నీటి మడుగులో మునిగి బాలిక మృతి

- November 19, 2022 , by Maagulf
ఖైబర్‌లో నీటి మడుగులో మునిగి బాలిక మృతి

మదీనా : మదీనాలోని ఖైబర్ గవర్నరేట్‌లోని లోయలో వర్షపు నీటి కారణంగా ఏర్పడిన నీటి మడుగులో ఒక బాలిక ప్రమాదవశాత్తు మునిగి చనిపోయింది. ఈ మేరకు మదీనా ప్రాంతంలోని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. వర్షాల సమయంలో వాగులు, నీటి మడుగుల వద్దకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించింది. కుటుంబాలు పిల్లలను పర్యవేక్షించాలని, వారి వినోద పర్యటనల సమయంలో నీటి కొలనుల వద్దకు వారిని అనుమతించవద్దని స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com