BD240 దుర్వినియోగం.. టాప్ కంపెనీ అధికారికి సంవత్సరం జైలు శిక్ష
- November 20, 2022
బహ్రెయిన్: తన కంపెనీ అడ్వర్టైజింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం నకిలీ రసీదులను తయారు చేసి నిధులను స్వాహా చేసినందుకు ఓ ఉన్నతాధికారికి ఏడాది జైలు శిక్ష పడింది. కంపెనీలో కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడని ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు పేర్కొంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మునిసిపల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పట్టణ ప్రణాళిక కింద పబ్లిక్ రోడ్లపై ప్రకటనల సైన్ బోర్డుల కోసం అతని కంపెనీ యాజమాన్యంలోని లైసెన్స్లను పునరుద్ధరించడానికి అతనికి అధికారం ఉంది. సైన్బోర్డ్ను అద్దెకు తీసుకున్నందుకు మంత్రిత్వ శాఖ కంపెనీ BD80 వసూలు చేస్తోంది. అనుమానితుడు లైసెన్స్ను పునరుద్ధరించడానికి బదులుగా తేదీలు మార్చి పాత రశీదును ఉపయోగించాడు. ఆ తర్వాత కంపెనీకి ఫైల్ చేసి డబ్బులు జేబులో వేసుకున్నాడు. ఈ విధంగా సదరు ఆఫీసరు BD240 జేబులో పెట్టుకోవడానికి మూడు రసీదులను మార్చాడు. అయితే ఫీజులు చెల్లించడం లేదంటూ మంత్రిత్వ శాఖ తమ సైన్ బోర్డులను తొలగించినట్లు కంపెనీ అధికారులు గుర్తించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో డైరెక్టర్ దాఖలు చేసిన రశీదులతో అధికారులు మంత్రిత్వ శాఖను సంప్రదించగా, అవన్నీ నకిలీవని తేలింది. దీంతో కంపెనీ నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అధికారులు అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







