ఎక్స్పో సిటీ దుబాయ్: Dh30 కంటే తక్కువ ధరకు ఫిఫా ప్రపంచ కప్ లైవ్ యాక్షన్స్
- November 20, 2022
దుబాయ్: ఫుట్ బాల్ అభిమానులకు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచులను లైవ్ లో చూపించేందుకు ఎక్స్పో సిటీ దుబాయ్ సిద్ధమైంది. నివాసితులు, సందర్శకులు 30 దిర్హామ్లు మాత్రమే చెల్లించి ఒక రోజు మొత్తం ఫుట్బాల్ మ్యాచులను ఆస్వాదించవచ్చు. పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పించారు. భారీ స్క్రీన్లపై మ్యాచ్లను వీక్షించడంతోపాటు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎంటర్ టైన్ జోన్లలో సరదాగా గడపవచ్చు. రేపు ఖతార్లో ప్రారంభమవుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను ప్రారంభ వేడుకలను, మొదటి మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎక్స్పో సిటీ దుబాయ్ ఫ్యాన్ సిటీలో మూడు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







