రూపాయికే నల్లా కనెక్షన్ ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో..
- April 23, 2016
తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు తెలంగాణలోని అన్ని పురపాలక సంఘాల్లో ఇక ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వబోతున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ దీనికి సంబంధించి సమగ్ర విధివిధానాలతోకూడిన ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించడం, జవాబుదారీతనం పెంచడానికి రూపాయికే నల్లా కనెక్షన్ విధానం ఉపయోగపడుతుందని మంత్రులు హరీశ్రావు, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్రెడ్డిల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికకు ఇటీవల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో నల్లా కనెక్షన్లు ఇవ్వడంపై అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటికే కరీంనగర్ నగరపాలక సంస్థలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అదేతరహాలో రాష్ట్రవ్యాప్తంగా కనెక్షన్లు ఇవ్వనున్నారు. కనెక్షన్ను క్రమబద్ధీకరించుకునే వారికి అపరాధ రుసుము కూడా వసూలు చేయరాదని ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







