రూపాయికే నల్లా కనెక్షన్ ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో..
- April 23, 2016
తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు తెలంగాణలోని అన్ని పురపాలక సంఘాల్లో ఇక ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వబోతున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ దీనికి సంబంధించి సమగ్ర విధివిధానాలతోకూడిన ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించడం, జవాబుదారీతనం పెంచడానికి రూపాయికే నల్లా కనెక్షన్ విధానం ఉపయోగపడుతుందని మంత్రులు హరీశ్రావు, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్రెడ్డిల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికకు ఇటీవల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో నల్లా కనెక్షన్లు ఇవ్వడంపై అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటికే కరీంనగర్ నగరపాలక సంస్థలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అదేతరహాలో రాష్ట్రవ్యాప్తంగా కనెక్షన్లు ఇవ్వనున్నారు. కనెక్షన్ను క్రమబద్ధీకరించుకునే వారికి అపరాధ రుసుము కూడా వసూలు చేయరాదని ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









