రూపాయికే నల్లా కనెక్షన్ ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో..
- April 23, 2016
తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు తెలంగాణలోని అన్ని పురపాలక సంఘాల్లో ఇక ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వబోతున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ దీనికి సంబంధించి సమగ్ర విధివిధానాలతోకూడిన ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించడం, జవాబుదారీతనం పెంచడానికి రూపాయికే నల్లా కనెక్షన్ విధానం ఉపయోగపడుతుందని మంత్రులు హరీశ్రావు, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్రెడ్డిల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికకు ఇటీవల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో నల్లా కనెక్షన్లు ఇవ్వడంపై అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటికే కరీంనగర్ నగరపాలక సంస్థలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అదేతరహాలో రాష్ట్రవ్యాప్తంగా కనెక్షన్లు ఇవ్వనున్నారు. కనెక్షన్ను క్రమబద్ధీకరించుకునే వారికి అపరాధ రుసుము కూడా వసూలు చేయరాదని ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









