ఇంగ్లండ్తో మ్యాచ్.. ఇరాన్ వినూత్న నిరసన!
- November 21, 2022
దోహా: ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తలపడుతోంది. ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడింది. అయితే, ఇరాన్ మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. హిజాబ్కు వ్యతిరేకంగా ఇరాన్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.
కొన్ని వారాల క్రితం హిజాబ్ సరిగా ధరించలేదంటూ పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి, మృతి చెందినప్పటి నుంచి ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులకు మద్దతుగా, ఇరాన్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఆ దేశ ఆటగాళ్లు ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచులో జాతీయ గీతాన్ని ఆలపించలేదు.
ఆట జరుగుతున్న ఖలీఫా అంతర్జాతీయ మైదానంలో ఇరాన్ జాతీయ గీతాన్ని ప్లే చేసిన సమయంలో ఆ దేశానికి చెందిన 11 మంది ఆటగాళ్లూ మౌనంగా ఉండిపోయారు. తమ జట్టు సభ్యులం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ కెప్టెన్ అలీరెజా జహంబఖష్ చెప్పాడు.
తాజా వార్తలు
- ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ
- అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు
- టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!
- అబ్షర్ ద్వారా 4 కొత్త ఎలక్ట్రానిక్ సివిల్ సేవలు..!!
- సెయిలర్ కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్..!!
- ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!
- ఉచిత మొబైల్ రెమిటెన్స్ యాప్ 'తాత్కాలికంగా' నిలిపివేత..!!
- జార్జియాలో అద్భుతంగా మెరిసిన 'చెంచు లక్ష్మి' సంస్కృతి పండుగ
- ఏపీలో భారీవర్షాల పై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్