యూఏఈ-ఇండియా ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కొత్త నిబంధనలు
- November 21, 2022యూఏఈ: యూఏఈతో పాటు ఇతర దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులు తమ పాస్పోర్ట్లలో వారి ప్రాథమిక (మొదటి పేరు), ద్వితీయ (ఇంటిపేరు) పేర్లు ఉండేలా చూసుకోవాలని Air India Express ప్రకటించింది. ఈ మేరకు యూఏఈలోని అన్ని ట్రావెల్ ఏజెంట్లకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎయిర్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇంటి పేరు లేదా ఇచ్చిన పేరుతో ఒకే పేరు (పదం) ఉన్న ఏదైనా పాస్పోర్ట్ హోల్డర్ను యూఏఈ ఇమ్మిగ్రేషన్ విభాగం అంగీకరించదు. అలాంటి ప్రయాణీకులను INAD (ప్రయాణానికి అనుమతి లేదు)గా పరిగణిస్తుంది. కొత్త మార్గదర్శకాలు నవంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఉదాహరణకు పాస్పోర్ట్లో ఏదైనా ప్రయాణీకుడి పేరు ఇంటిపేరుతో (ఖాళీ) లేదా అతని/ఆమె ఇచ్చిన పేరు ప్రవీణ్ గా పేర్కొంటే.. ఇంటిపేరుతను (ఖాళీగా) వదిలితే అటువంటి పాస్పోర్టులను యూఏఈ ఇమ్మిగ్రేషన్ అంగీకరించదు. వీసా గతంలో జారీ చేసినా అతను/ఆమె ఇమ్మిగ్రేషన్ ద్వారా INAD అవుతాడని ఎయిర్ ఇండియా పేర్కొంది. టూరిస్ట్ లేదా విజిట్ వీసాపై ప్రయాణించే వారికి ఈ నిబంధన వర్తిస్తుందని.. నివాసం లేదా ఉపాధి వీసాలను కొత్త నిబంధన నుంచి మినహాయించాలని సర్క్యులర్ లో ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?