సందర్శకులకు స్వాగతం పలుకుతున్న 'అమద్ దుక్మ్ 22'
- November 25, 2022మస్కట్: దుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో 'అమద్ దుక్మ్ 22' ప్రారంభానికి సిద్ధమైంది. శుక్రవారం నుండి 9 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ ను పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ ఫ్రీ జోన్స్ (OPAZ), మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 'అమద్ దుక్మ్ 22' ఈవెంట్ లో సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్, ఎంటర్ టైన్ మెంట్ సంబంధించిన సృజనాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సంస్కృతి, ఆవిష్కరణలు, క్రీడలు, సాంకేతికత లతో పాటు ఈ ప్రాంతంలో ఆర్థిక సామర్థ్యాన్ని.. పెరుగుతున్న పెట్టుబడులను పరిచయం చేయడం ఈ ఈవెంట్ వెనుక ఉన్న ఆలోచన అని డుక్మ్లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్టింగ్ సీఈఓ ఎంగ్ అహ్మద్ బిన్ అలీ అకాక్ పేర్కొన్నారు. భవిష్యత్తు ఆకాంక్షలను సాధించడంలో యువతది కీలక పాత్ర కాబట్టి వారి సృజనాత్మకతను పెంపొందించేందుకు అమద్ దుక్మ్ 22 ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..