సందర్శకులకు స్వాగతం పలుకుతున్న 'అమద్ దుక్మ్ 22'
- November 25, 2022
మస్కట్: దుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో 'అమద్ దుక్మ్ 22' ప్రారంభానికి సిద్ధమైంది. శుక్రవారం నుండి 9 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ ను పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ ఫ్రీ జోన్స్ (OPAZ), మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 'అమద్ దుక్మ్ 22' ఈవెంట్ లో సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్, ఎంటర్ టైన్ మెంట్ సంబంధించిన సృజనాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సంస్కృతి, ఆవిష్కరణలు, క్రీడలు, సాంకేతికత లతో పాటు ఈ ప్రాంతంలో ఆర్థిక సామర్థ్యాన్ని.. పెరుగుతున్న పెట్టుబడులను పరిచయం చేయడం ఈ ఈవెంట్ వెనుక ఉన్న ఆలోచన అని డుక్మ్లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్టింగ్ సీఈఓ ఎంగ్ అహ్మద్ బిన్ అలీ అకాక్ పేర్కొన్నారు. భవిష్యత్తు ఆకాంక్షలను సాధించడంలో యువతది కీలక పాత్ర కాబట్టి వారి సృజనాత్మకతను పెంపొందించేందుకు అమద్ దుక్మ్ 22 ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







